రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(Ellareddypet) మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన “గాలిపెల్లి కృష్ణ హరి” మొదటగా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో ఉపాధ్యాయులుగ చివరగా రాచర్ల తిమ్మాపూర్ “జిల్లా పరిషత్ హై స్కూల్” లో ప్రధానోపాధ్యాయులుగా చురుకుగా పనిచేసి ప్రస్తుతం ఎల్లరెడ్డిపేట్ మండల విద్యాధికారిగా (ఎం .ఈ .
ఓ ) నియామకం అయ్యారు,డిఈఓ ఏ .రమేష్ కుమార్(DEO A.Ramesh Kumar) ఎం ఈ ఓ నియామక పత్రాన్ని కృష్ణ హరి కి అందజేశారు.ఇటీవలే ఉపాధ్యాయుల దినోత్సవం రోజు జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా కూడా అవార్డు అందుకున్నారు.
మండలంలోని విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి లోటుపాటులు లేకుండా మెరుగైన విద్య, పోషకఆహారం అందే విధంగా చూడాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.