పిల్లల మీద కిరోసిన్ పోసి తగల బెట్టిన తల్లి

ఆలుమగల మధ్య గొడవ ఐదుగురి ప్రాణాల మీదకు తెచ్చింది.నలుగురు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పింటించుకుందో తల్లి.

 Mother Burnt Her Kids With Kerosene-TeluguStop.com

ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు తల్లి ప్రాణాలు విడిచారు.మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు.

చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘెరం కలిచివేస్తోంది.క్షణికావేశంలో చేసిన ఘోరానికి కన్నతల్లితో సహా ఇద్దరు పిల్లలు ప్రాణాలు విడిచారు.

మరో ఇద్దరు పసివాళ్లు ప్రాణాపాయస్థితిలో అల్లాడుతున్నారు.ప్రకాశం జిల్లాకు చెందిన మహ్మద్ రహీమ్.

చిత్తూరు జిల్లా మంగళం గ్రామానికి బతుదెరువు కోసం వలసొచ్చాడు.అప్పటికే ఇద్దరు కూతుళ్లున్న జరీనాను రెండో పెళ్లి చేసుకున్నాడు.

వీరికి మరో ఇద్దరు కుమారులు పుట్టారు.రహీమ్.

పెద్ద కూతురితో అసభ్యంగా ప్రవర్తించడంతో భార్యభర్తల మధ్య గొడవ నడుస్తోంది.ఈ నేపథ్యంలో జరీనా.

నలుగురి పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించి తాను ఆత్మహత్యయత్నం చేసింది.

అరుపులు కేకలు విన్న స్థానికులు హుటాహుటినా అందరిని ఆస్పత్రికి తరలించగా.

చికిత్సపొందుతూ ఇద్దరు పిల్లలుసహా తల్లి ప్రాణాలు కోల్పోయింది.మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube