భారత ప్రధానిగా మోడీ కుర్చీలో కూర్చున్న నాటినుండి ఇండియా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతోంది.శక్తివంతమైన దేశాల జాబితాలో కూడా ఇండియా పేరు ఇటీవల వినిపిస్తూ ఉంది.
అంతర్జాతీయ స్థాయిలో భారత్ లో గతంలో ఎవరికీ లేని రీతిలో మోడీకి విపరీతమైన క్రేజ్ ఉంది.ఇదిలా ఉంటే ఇప్పుడు మోడీ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు.
విషయంలోకి వెళితే సోషల్ మీడియా మాధ్యమాలలో ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి వాటిలో ప్రధాని మోడీ చాలా యాక్టివ్ గా ఉండటంతో భారీ ఎత్తున ఫాలోవర్లు ఉంటారు.
అయితే ఈ తరుణంలో మరో ఘనత సాధించారు.
అదే మిటంటే ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానల్ నీ కోటి మంది సబ్ స్క్రైబ్ చేసుకోవడం జరిగింది.యూట్యూబ్ ఛానల్ లో… అత్యధిక సబ్ స్క్రైబర్ లు ప్రపంచ నేతలలో ఎక్కువ కలిగిన ప్రధానిగా నెంబర్ వన్ స్థానంలో మోడీ ఉండి… సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.
36 లక్షల మంది సబ్స్క్రైబర్లతో … రెండో స్థానంలో బ్రెజిల్ అధ్యక్షుడు ఉన్నాడు.మూడో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఉన్నాడు.
అయితే మోడీ దరిదాపుల్లో మాత్రం.యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ విషయంలో ఏ ప్రధాని లేరు.
ప్రధాని మోడీ ప్రసంగాలు మరియు పలు వీడియోలు ఈ ఛానల్ లో ప్రసారం అవుతూ ఉంటాయి.