కోవిడ్ విలయతాండవం.. ఒక్కరోజే 64,553 మందికి !

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది.ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికి చాల మంది ప్రాణాలను కోల్పోయారు.

 India, Corona Cases, One Day-TeluguStop.com

ఈ మహమ్మారి బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే దేశ ప్రజలను ఈ మహమ్మారి బారి నుండి కాపాడుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అంతేకాకుండా ఈ వైరస్ ని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.ప్రజలు బయటికి వెళ్ళినపుడు మాస్కులు, సామజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అయితే గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 64,553 మంది ఈ వైర‌స్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించారు.అయితే గ‌డిచిన 24 గంట‌ల్లో 1,007 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలను కోల్పోయారు.

అయితే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల 76 లక్షల 94 వేల కరోనా పరీక్షలు చేశారు.దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య‌ 24లక్షల 61వేల 191కి చేరుకుంది.

ఇప్పటి వరకు 17,51,555 మంది ఈ మహమ్మారి బారి నుండి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ఇంటికి చేరుకున్నారు.దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48,040 మంది.

అయితే ప్ర‌స్తుతం దేశంలో 6,61,595 మంది ఈ మహమ్మారి కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube