ప్రస్తుతం జబర్దస్త్ షోలో రష్మీ సుధీర్ జోడీ తర్వాత ఇమ్మాన్యుయేల్ వర్ష జోడీకి మాత్రమే ఆ స్థాయిలో క్రేజ్, పాపులారిటీ ఉంది.ఈ జోడీ కలిసి చేసే స్కిట్లు, ఒకరిపై ఒకరు వేసుకునే పంచ్ లు మంచి టీఆర్పీ రేటింగ్ లు సొంతం చేసుకుంటున్నాయి.
వర్ష, ఇమ్మాన్యుయేల్ చాలా సందర్భాల్లో తమ మాటల ద్వారా ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకున్నారు.అయితే తాజాగా ప్రసారమైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో వర్ష ఇమ్మాన్యుయేల్ కు షాకిచ్చింది.
తాజా ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ తో పాటు అతని తండ్రి కూడా వచ్చారు.స్కిట్ లో బుల్లెట్ భాస్కర్ వర్షను పెళ్లి చేసుకోగా వర్ష కాఫీ తాగుతారా.? టీ తాగుతారా.? అని బుల్లెట్ భాస్కర్ ను అడుగుతుంది.బుల్లెట్ భాస్కర్ డార్లింగ్ నీ చేతితో విషం ఇచ్చినా కూడా స్వీట్ గా ఉంటుందని చెబుతూ వర్షకు ముద్దు పెడతాడు.భాస్కర్ అలా చేయడంతో షాకైన ఇమ్మాన్యుయేల్ ఇందుకేనా టీమ్ లను మార్చింది అంటూ ప్రశ్నిస్తాడు.
ఆ తర్వాత వర్ష లంచ్ కు ఏం చేయమంటారని బుల్లెట్ భాస్కర్ ను అడగగా ములక్కాడ పులుసు, ములక్కాడ చికెన్, ములక్కాడ మటన్ కావాలని బుల్లెట్ భాస్కర్ చెప్పగా ములక్కాడ జ్యూస్ అంటూ వర్ష చెబుతుంది.
ఆ తరువాత మరో స్కిట్ లో వర్ష రష్మీతో మీ జోడీ సంగతి ఏంటి.? అని అడగగా మా జోడీ సంగతి పక్కన పెట్టు.? మీ జోడీ సంగతి ఏమిటని రష్మీ ప్రశ్నిస్తారు.నువ్వు శ్రీదేవిలాగా సిగ్గు పడుతూ ఉండు అక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇమ్మాన్యుయేల్ ముగ్గులు వేస్తూ ఉంటాడు అని రష్మీ అంటుంది.
అక్కా నువ్వు నన్ను వేసుకుంటున్నావ్ తెలుసా అని వర్ష చెప్పగా మరి ఎవర్ని వేయాలి అని రష్మీ ధీటుగా కౌంటర్ ఇస్తుంది.సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ స్కిట్ లో వేసిన పంచ్ లు కూడా హైలెట్ అయ్యాయి.సుధీర్ ప్రోమోలో మ్యాజిక్ చేయడం గమనార్హం.