తెలుగులో మొదలు పెట్టిన కొంత కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో గురించి తెలియని వారుండరు.ఇప్పటి వరకు ఈ బిగ్ బాస్ షో దాదాపుగా మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని నాలుగు సీజన్ వైపు అడుగులేస్తోంది.
అయితే తాజాగా షో నిర్వాహకులు 4వ సీజన్ ని కొంతమేర మరింత హాట్ గా చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్టులో టాలీవుడ్ మాజీ హీరోయిన్ మరియు స్పెషల్ సాంగ్ నర్తకి హంసా నందిని కూడా పాల్గొంటున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈమెతో పాటు ఒకప్పటి హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నట్లు సమాచారం.అయితే ఈ పాటికి ఈ షో కి సంబంధించినటువంటి చిత్రీకరణ పనులు మొదలవ్వాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుండటంతో కొంత కాలం పాటు నిర్వాహకులు చిత్రీకరణ పనులను వాయిదా వేశారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా బిగ్ బాస్ మూడవ సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాలీవుడ్ కింగ్ నాగార్జున మళ్లీ బిగ్ బాస్ నాలుగో సీజన్ కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.అయితే మరోవైపు ఈ షో మొదటి సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నాలుగవ సీజన్ కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ ప్రస్తుతం తారక్ పలు ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో తప్పుకున్నట్లు తెలుస్తోంది.