టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రాశి ఖన్నా గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.
తెలుగులో పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ లను అందుకుంది.అంతే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా నటించింది.
ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
తొలిసారిగా బాలీవుడ్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.ఇక జోరు, జిల్, బెంగాల్ టైగర్, హైపర్, తొలిప్రేమ, ప్రతి రోజు పండగే వంటి పలు సినిమాలలో నటించగా కొంత వరకు సక్సెస్ అందుకుంది.
మరి కొన్ని సినిమాల్లో ప్లాప్ లు కూడా ఎదుర్కొంది.
ఇక గత ఏడాది అంతపురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆ మధ్య వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు అందుకున్నట్లు వార్తలు వినిపించాయి.కానీ మళ్లీ ఆ విషయం గురించి ఎటువంటి సమాచారం అందలేదు.
ఇక ఒకప్పుడు బొద్దుగా ఉండే రాశి ఖన్నా ఇప్పుడు పూర్తి గ్లామర్ ను పరిచయం చేసింది.తెగ వర్క్ అవుట్ లు చేస్తూ మంచి ఫిజిక్ ను సంపాదించు కుంది.
బాగా సన్నబడి తనలోని అందాలను బయట పెట్టింది.బహుశా అవకాశాల కోసం రాశి ఖన్నా ఇలా తయారయిందని అర్థమవుతుంది.ఇక సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో కూడా రచ్చ చేస్తుంది.అయినా కూడా ఈ ముద్దుగుమ్మ అంతగా అవకాశాలు అందుకోలేక పోతుంది.సినిమాలకు దూరంగా ఉన్న కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.
ఇక ఈ ముద్దుగుమ్మ ఎంత అందాలను ఆరబోసిన కూడా అంతగా అవకాశాలు అందుకోలేకపోవడానికి కారణం మాత్రం తెలియడం లేదు.ఇదంతా పక్కన పెడితే తన ఇన్ స్టా గ్రామ్ లో ఏదో ఒక పోస్టుతో బాగా హల్ చల్ చేస్తుంది.తాను ఖాళీ సమయంలో సరదాగా తిరిగిన ట్రిప్స్ ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.
అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.
ఇక తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని విషయాలను పంచుకుంది.అందులో ఒక మాటతో బాగా రచ్చ రచ్చ చేసింది.ఇంతకీ అది ఏ సందర్భంలో తను ఆ విషయాన్ని పంచుకుందో తెలియదు కానీ.
మిడిల్ ఫింగర్ చూపించాల్సిన అవసరం లేదని.నా కళ్ళు ఉన్నాయి చాలు అంటూ పంచుకుంది.
దీంతో ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.
అంతే కాకుండా మరికొన్ని పోస్ట్ లను కూడా షేర్ చేసుకుంది.
ఇక ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో మాత్రం తెగ అవకాశాలు అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ టాలీవుడ్ కు మాత్రం దూరంగానే ఉందని చెప్పవచ్చు.