టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో దశరథ్( Dasarath ) ఒకరు.దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడం గమనార్హం.
అయితే కొన్ని సినిమాల ఫలితాలు మాత్రం దశరథ్ కు భారీ షాకిచ్చాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ దర్శకుడు ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించారు.
ఈ ఇంటర్వ్యూలో దశరథ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.ప్రభాస్, మనోజ్ గురించి ఈ స్టార్ డైరెక్టర్ గొప్పగా చెప్పుకొచ్చారు.
త్రివిక్రమ్ పోసాని దగ్గర బిజీగా ఉండేవారని దశరథ్ తెలిపారు.ఇప్పటికీ నాకు అందరితో మంచి రిలేషన్స్ ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.100 మంది పని చేస్తున్న సమయంలో క్రెడిట్స్ కోసం పోరాటం చేయడం సరికాదని ఆయన తెలిపారు.
సంతోషం, సంబరం, స్వాగతం టైటిల్స్ ఫస్ట్ లెటర్ గురించి దశరథ్ చెబుతూ స నాకు సెంటిమెంట్ కాదని ఆయన కామెంట్లు చేశారు.జయం, దిల్ హిట్ కావడంతో సంబరం స్క్రిప్ట్ లో మార్పులు చేశామని దశరథ్ అన్నారు.ఆ మార్పులే సినిమా ఫ్లాప్ కు కారణమని ఆయన పేర్కొన్నారు.
మనోజ్ తో శ్రీ, శౌర్య సినిమా( Shourya movie ) తీశానని రెండు సినిమాల ఫ్లాప్ కు నేనే కారణమని దశరథ్ చెప్పుకొచ్చారు.
శౌర్య సినిమా సక్సెస్ సాధిస్తుందని అనుకున్నానని కానీ సినిమా ఫ్లాపైందని ఆయన తెలిపారు.ప్రభాస్, మనోజ్ తో టచ్ లో ఉంటాడని నా కొడుకు పుడితే మనోజ్ లా ఉండాలని కోరుకుంటానని దశరథ్ అన్నారు.అయితే మనోజ్ కు హిట్ ఇవ్వలేకపోయానని బాధ ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ఆయన వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.లవ్ యు రామ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దశరథ్ ఈ విషయాలను వెల్లడించారు.