బస్సును చూసి బెదిరిన కాడేడ్లు కుంటలో పడి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆర్టీసీ బస్సును చూసి బెదరిన కాడెడ్లు పరుగు తీసి పక్కనే ఉన్న కుంటలో పడి మృతి చెందిన విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురంలో గురువారం రాత్రి జరిగింది.బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం… సీతారాంపురం గ్రామానికి చెందిన రైతు చేగూరి పాండు పత్తి చేనులో గుంటుక కొట్టి తన రెండు ఎడ్లను

 Cows Were Threatened By The Bus And Died, Cows ,threatened Cows, Bus , Cows Die-TeluguStop.com

కాడితో దొడ్డి వైపు వెళుతుండగా అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సును చూసి ఒక్కసారిగా బెదరడంతో పక్కన ఉన్న కుంటలో పడి అక్కడికక్కడే మృతి చెందాయి.

సుమారు లక్షా యాభై వేల విలువచేసే ఎడ్లు మరణించడంతో బాధిత రైతు కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.కాడెద్దులు మరణించడంతో జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube