ఏపీలో పలు విద్యుత్ ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.ఈ మేరకు రూ.6,500 కోట్లతో కొత్త సబ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.
హెచ్పీసీఎల్ తో రూ.10 వేల కోట్ల ఎంవోయూ కుదిరిందని తెలుస్తోంది.దాదాపు 1500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.
మొత్తం 28 సబ్ స్టేషన్లలో 12 సబ్ స్టేషన్లను ప్రారంభించామని సీఎం జగన్ తెలిపారు.మరో 16 సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు.850 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుతో 1700 ఉద్యోగాలు వస్తున్నాయన్నారు.వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
ఈ క్రమంలో 14 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోందని వెల్లడించారు.మరో 25 ఏళ్ల పాటు ఢోకా లేకుండా రైతులకు ఉచిత విద్యుత్ అందుతుందని స్పష్టం చేశారు.