హైదరాబాద్ నగరంలో వరల్డ్ క్లాస్ సైక్లింగ్ ట్రాక్ కు మంత్రి కేటీఆర్ రేపు భూమి పూజ చేయనున్నారు.ఔటర్ రింగ్ రోడ్డు మీద నానక్ రామ్ గూడ, తెలంగాణ స్టేట్ పోలిస్ అకాడమీ, నార్సింగి, కొల్లూర్ ల సమీపంలో 23 కిలో మీటర్ల మేర ప్రపంచ శ్రేణి సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు.
పైన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు కానుండగా… ఆ ప్యానెళ్ల నీడలో సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు అవుతుంది.మూడు లేన్లతో 4.5 మీటర్ల వెడల్పుతో ఈ ట్రాక్ ఏర్పాటు కానుంది.గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ట్రాక్కు భూమి పూజ చేయనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.