వ‌ర‌ల్డ్ క్లాస్ సైక్లింగ్ ట్రాక్ కు రేపు భూమిపూజ‌

హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌ర‌ల్డ్ క్లాస్ సైక్లింగ్ ట్రాక్ కు మంత్రి కేటీఆర్ రేపు భూమి పూజ చేయ‌నున్నారు.

ఔట‌ర్ రింగ్ రోడ్డు మీద నానక్ రామ్ గూడ‌, తెలంగాణ స్టేట్ పోలిస్ అకాడమీ, నార్సింగి, కొల్లూర్ ల స‌మీపంలో 23 కిలో మీట‌ర్ల మేర ప్ర‌పంచ శ్రేణి సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయ‌నున్నారు.

పైన‌ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు కానుండ‌గా.ఆ ప్యానెళ్ల నీడలో సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు అవుతుంది.

మూడు లేన్ల‌తో 4.5 మీట‌ర్ల వెడ‌ల్పుతో ఈ ట్రాక్ ఏర్పాటు కానుంది.

గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు ఈ ట్రాక్‌కు భూమి పూజ చేయ‌నున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

ఇంటర్ పరీక్షలలో మార్కులతో సత్తా చాటిన ధనుష్ కొడుకు.. తండ్రికి తగ్గ తనయుడంటూ?