పంచాయతీ ఎన్నికలలో కూడా వైసిపి పార్టీ హవా కొనసాగుతున్నట్లు ఫలితాలు వస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.ఈ క్రమంలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కీలక నేత బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురంలో 38 స్థానాల్లో దాదాపు 30 స్థానాలు వైసీపీ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకోవటంతో బాలకృష్ణకు నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలినట్లు ఏపీ రాజకీయాల్లో టాక్.
ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పంచాయతీ రొద్దంలో టీడీపీ ఓటమి పాలైంది.అదే రీతిలో పార్థసారధి సొంత వార్డు మరువపల్లిలోనూ టీడీపీకి పరాభవం ఎదురైంది.అదేవిధంగా మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సొంత పంచాయితీ వెంకటరమణ పల్లి లో కూడా టిడిపి ఓడిపోవడం జరిగింది.ఇదే తరుణంలో మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న సొంత పంచాయతీ మద్దనకుంటలో టీడీపీ ఓటమి పాలవ్వడం వైసీపీ జెండా ఎగరటం తో వైసీపీ శ్రేణులు ఫుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నాయి.
.