స్టార్ హీరో బాలకృష్ణ సినీ కేరీర్ లో నటుడిగా ఎన్నో విజయాలు ఉన్నాయి.అఖండ సినిమాతో బాలయ్య కేరీర్ లో మరో బ్లాక్ బస్టర్ చేరింది.
సక్సెస్ లో ఉన్న యంగ్ జనరేషన్ స్టార్ డైరెక్టర్లు సైతం బాలయ్యతో సినిమాలను తెరకెక్కించాలని ఆసక్తి చూపిస్తున్నారు.బాలయ్య సైతం సినిమాల విషయంలో వేగం పెంచాలని భావిస్తూ నచ్చిన కథలకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
వచ్చే ఏడాది బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ రిలీజ్ కానుంది.
ఈ సినిమాకు మేకర్స్ వేటపాలెం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఒక సినిమా స్క్రిప్ట్ ను తాను నేలకేసి కొట్టి వెళ్లిపోయానని బాలయ్య అన్ స్టాపబుల్ షోలో వెల్లడించారు.హీరోగా ప్రూవ్ చేసుకున్న బాలయ్యకు డైరెక్షన్ అంటే కూడా ఎంతో ఇష్టం.
సీనియర్ ఎన్టీఆర్ కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారనే సంగతి తెలిసిందే.బాలయ్యకు కోపం ఎక్కువ కాగా పలు సందర్భాల్లో బాలయ్య తన కోపాన్ని ప్రదర్శించి విమర్శల పాలయ్యారు.
అయితే బాలయ్య సన్నిహితులలో కొందరు మాత్రం ఆయన దేవుడని చెబుతారు.అయితే నాన్నగారితో కూడా ఒకసారి గొడవ పడ్డానని బాలయ్య అన్నారు.
సామ్రాట్ అశోక్ సినిమాకు తాను దర్శకత్వం వహించాలని అనుకున్నానని స్క్రిప్ట్ పనులు పూర్తైన తర్వాత నాన్నకు కావాల్సినవన్నీ అడిగానని బాలయ్య అన్నారు.సినిమాను 70 ఎంఎంలో చేద్దామని అడిగితే 35 ఎంఎంలో చేద్దామని నాన్నగారు చెప్పారని బాలయ్య చెప్పుకొచ్చారు.
తాను ఆ సినిమా క్లైమాక్స్ కు 10,000 మంది కావాలంటే నాన్న హా అంటూ వెటకారం చేశారని బాలయ్య తెలిపారు.ఆ తర్వాత 2000 గుర్రాలు, 200 ఒంటెలు కావాలని చెబితే నాన్నగారు నవ్వేశారని బాలయ్య పేర్కొన్నారు.నాన్న అలా చేయడంతో తనకు కోపం వచ్చి స్క్రిప్ట్ ను నేలకేసి కొట్టి సినిమా చేయడం లేదని చెప్పానని బాలయ్య చెప్పుకొచ్చారు.