బిగ్ బాస్ షోకు నేచరల్ స్టార్.. హౌస్ దద్దరిల్లిపోయిందిగా!

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమం నేటితో ముగియనుంది.

ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో ఎంతో మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ వేదికపైకి వచ్చి ప్రేక్షకులను సందడి చేయనున్నారు.

ఇలా సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా బిగ్ బాస్ వేదికపైకి రావడంతో బిగ్ బాస్ వేదిక దద్దరిల్లిపోయిందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ బిగ్ బాస్ వేదికపైకి వచ్చి సరదాగా కంటెస్టెంట్ లతో ముచ్చటించి వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

వీరి తర్వాత నాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ వేదిక పైకి వచ్చారు.బిగ్ బాస్ సీజన్ 2 లో యాంకర్ గా నాని దుమ్మురేపి ప్రస్తుతం బిగ్ బాస్ వేదికపైకి తన సినిమా శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వేదిక పైకి వచ్చారు.

నాని రావడంతో గ్రాండ్ వెల్కమ్ చెప్పిన నాగార్జున ఆ తర్వాత హౌస్ సభ్యులతో కలిసి ఎంతో సరదాగా ముచ్చటించారు.ఇక నానితో పాటు హీరోయిన్ సాయి పల్లవి కూడా వేదికపైకి వచ్చారు.

Advertisement

ఇక సినిమాల విషయానికొస్తే గతంలో నాగార్జున నాని కలిసి నటించిన దేవదాసు చిత్రం గురించి మనందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే మరోసారి ఇద్దరు హీరోలు కలిసి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచారు.అదే విధంగా సాయి పల్లవి, నాని హౌస్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ టీమ్ అలాగే,83 చిత్ర బృందం వేదిక పైకి రానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు