పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వెండితెరపై కనిపించాడు.వకీల్ సాబ్ లాంటి సందేశాత్మక మూవీతో ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కింది.ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసాడు.
ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా అంజలి, అనన్య, నివేతా థామస్ కీ రోల్స్ లో నటించారు.
పవన్ ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు.
దీనిని క్రిష్ హిస్టారికల్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.అందుకే ఇందులో యాక్షన్ సీన్లు ఎక్కువుగా ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమాలో క్రిష్ పవన్ కళ్యాణ్ తో కొన్ని యాక్షన్ సీన్లు కూడా చేయించాడు.ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ తెరకెక్కించడానికి క్రిష్ ప్రముఖ కొరియోగ్రాఫర్ కౌశల్ ను తీసుకున్నారు.
ఈ సినిమాను దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కాబోతుంది.అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ ను మళ్ళీ మొదలు పెట్టే ప్లాన్స్ చేస్తున్నారని సమాచారం.
ఈ సినిమా నుండి విడుదల అయినా ఫస్ట్ గ్లిమ్స్ ఇప్పటికే బాగా ఆకట్టుకుంది.
అయితే ఇప్పుడు ఫ్యాన్స్ కు వరుస ట్రీట్స్ ఇచ్చేందుకు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడట.
త్వరలోనే ఈ ట్రీట్స్ ఇవ్వనున్నాడు.సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయాలనీ క్రిష్ అనుకుంటున్నాడట.
అందుకే షూటింగ్ రీస్టార్ట్ అవ్వగానే ముందుగా టీజర్ కు సంభందించిన వరకు షూటింగ్ పూర్తి చెయ్యాలని క్రిష్ భావిస్తున్నాడని తెలుస్తుంది.ఇక ఇందులో హీరోయిన్ గా నటించే నిధి అగర్వాల్ పుట్టిన రోజుకు ఆమె పాత్రను పరిచయం చేయాలనీ డిసైడ్ అయ్యారట.
సో ఫ్యాన్స్ కు వరస ట్రీట్స్ రెడీ అయినట్లే.