విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు.ఈ క్రమంలో సతీసమేతంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ మేరకు కనకదుర్గ అమ్మవారికి గవర్నర్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.తరువాత అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందజేశారు.కాగా దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి మస్తాబైన సంగతి తెలిసిందే.
తొలిరోజు ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.