ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 13 జిల్లాల రాష్ట్రంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైయస్ జగన్ 2019 ఎన్నికల ప్రచారంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తా అంటూ అప్పట్లో హామీ ఇవ్వడం జరిగింది.
మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని పొందుపరిచారు.కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్లమెంటు నియోజక వర్గాలను కొత్త జిల్లాలుగా ప్రకటిస్తూ ఏపీ కేబినెట్ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది.
క్యాబినెట్ ఆమోదం ఆన్ లైన్ లో ప్రభుత్వం తీసుకోవడం జరిగింది.దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి సీఎస్ కు నివేదిక అందించడం జరిగింది.
ఈ పరిణామంతో కొత్త జిల్లాలకు సంబంధించిన వాటి ఫికేషన్ అర్ధరాత్రి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.సోమవారం నాడే కొత్త జిల్లాల నోటిఫికేషన్ కి సంబంధించి ప్రభుత్వ వర్గాల్లో వార్తలు వచ్చాయి.
దీంతో 13 జిల్లాలు కలిగిన ఏపీ ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు కలిగిన రాష్ట్రంగా అవతరించనున్నట్లు సమాచారం.