టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన ప్రతి సినిమాకి ఏదో ఒక కొత్తదనం చూపిస్తూ ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.ఇక తాజాగా అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన అల్లు అర్జున్ మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.
ఇప్పుడు టాలీవుడ్ లో వంద కోట్ల క్లబ్ హీరోలలో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉండగా ఇప్పుడు ఈ లిస్టులో అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు.దీంతో అతను తన రెమ్యునరేషన్ ని అమాంతం డబుల్ చేసినట్లు తెలుస్తుంది.
ఇప్పటి వరకు బన్నీ రెమ్యూనరేషన్ సినిమాకి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.అలవైకంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వంద కోట్ల క్లబ్ లో చేరడంతో తన పారితోషికాన్ని రెట్టింపు చేసి ప్రస్తుత చిత్రం కోసం తీసుకుంటున్నాడు.
అంటే ఇప్పుడు ఏకంగా ముప్పై కోట్లు రెమ్యునరేషన్ బన్నీకి ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయిపోవాల్సిందే అని తెలుస్తుంది.సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న ఈ తాజా సినిమా కోసం ముప్పై కోట్లు మైత్రి మూవీ మేకర్స్ నుంచి వసూలు చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
మరి బన్నీ డిమాండ్ కి తగ్గట్లు నిర్మాతలు కూడా అంత రెమ్యునరేషన్ ఇచ్చి అతనితో సినిమాలు తీయడానికి ఎంత మంది ముందుకొస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.