కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా చాలా మంది ప్రజలు రోడ్డున పడ్డారు.వీరిని పలువురు సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు ఆర్థికంగా చేయూతను అందించారు.
అయితే సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించే సోనూసూద్ రియల్ లైఫ్ లో హీరోగా నిలిచాడు.లాక్ డౌన్ లో చాలా మందిని ఆదుకుని వారి కష్టాలను తీర్చాడు.
సొంత ఖర్చులతో ఎందరో వలస కూలీలను వారి ఇంటికి చేర్చి అందరి మనసును దోచుకుంటున్నాడు.విదేశాల్లో ఇరుక్కుపోయిన భారతీయులను ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి వాళ్లను స్వస్థలానికి చేర్చాడు.
గత కొంత కాలం కిందట ఇద్దరు యువతులు నాగలి లాగుతువుండటమ్ చూసి చలించిపోయి వాళ్లకు ట్రాక్టర్ అందించాడు.మనసున్న మారాజులా అందరి గుండెల్లో పేరును సంపాదించుకున్నాడు.
అయితే తాజాగా, బీహార్ చంపారన్ లోని భోలా గ్రామంలో ఒక కుటుంబం నివాసం ఉంటుంది.వరుసగా కురుస్తున్న వర్షానికి ఆ గ్రామాన్ని వరద ముంచెత్తింది.దీంతో ఆ కుటుంబానికి ఆదాయం అందించే గేదెను వరదలో కోల్పోయారు.ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్ స్పందించాడు.
వెంటనే వారికి గేదెను కొనిచ్చాడు.దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఇలా చెప్పుకొచ్చాడు.
సోనూసూద్ మాట్లాడుతూ.‘‘ నేను నా మొదటి కారును కొన్నప్పుడు కూడా అంత సంతోషపడలేదు.
ఓ కుటుంబానికి గేదెను అందించినప్పుడు ఆ ఫీలింగ్ దొరికింది.ఒకవేళ ఆ గ్రామానికి వెళ్తే తప్పకుండా ఓ గ్లాసు గేదె పాలు తాగుతా’’ అంటూ ట్వీటర్ లో పేర్కొన్నాడు.