మెగాస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం ‘సరైనోడు’.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పాటలు కూడా మార్కెట్లోకి వచ్చిన విషయం తెల్సిందే.
ఆడియో వేడుక లేకుండానే ఈ పాటలు విడుదల అవ్వడంతో ఫ్యాన్స్ నిరుత్సాహం చెందకుండా చిత్ర యూనిట్ సభ్యులు వైజాగ్లో ఒక భారీ వేడుకను నిర్వహించబోతున్నారు.ఇప్పటికే వైజాగ్లో మెగా వేడుకకు ఏర్పాట్లు సిద్దం అయ్యాయి.
ఈనెల 10న భారీ ఎత్తున జరుగబోతున్న మెగా వేడుకలో మెగా ఫ్యాన్స్ అధిక సంఖ్యలో పాల్గొనబోతున్నారు.ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది.
మేనల్లుడు అల్లు అర్జున్ను ఆశీర్వదించేందుకు చిరంజీవి ఈనెల 10న వైజాగ్కు వెళ్లనున్నాడు.అక్కడ కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అల్లు అర్జున్ సినిమా ‘సరైనోడు’ వేడుకలో కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు.
చిరంజీవి హాజరు కాబోతుండటంతో ఒక్కసారిగా ఆ వేడుకకు అదనపు ఆకర్షణ అయ్యింది.వరుస విజయాలతో దూసుకు పోతున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు అని, మొదటి సారి పూర్తి స్థాయిలో బన్నీ ఈ సినిమాలో నటించి మెప్పించాడు అంటూ సినీ వర్గాల వారు సైతం అంటున్నారు.
ఈ చిత్రాన్ని ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.అల్లు అర్జున్కు జోడీగా ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.