గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘రుద్రమదేవి’.అనుష్క టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమాలో రానా ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.
అల్లు అర్జున్ గోనగన్నారెడ్డిగా అతిథి పాత్రలో నటించాడు.ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు, షాకింగ్ న్యూస్ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతూ వస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో అనుష్క మరియు నిత్యామీనన్లు తల్లి కూతురుగా కనిపించనున్నారు అంటూ చెప్పి అందరికి షాక్ ఇచ్చారు.
రుద్రమదేవి కూతురు అయిన ముమ్మిదమ్మగా నిత్యామీనన్ నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా ప్రకటించారు.
దాంతో నిత్యామీనన్కు తల్లిగా అనుష్క ఎలా కమిట్ అయ్యిందా అంటూ అంతా షాక్ అవుతున్నారు.అనుష్క, రానాల కూతురుగా నిత్యామీనన్ కనిపించనుంది.
ఈ సినిమాలో నిత్యామీనన్ ఎంత సమయం కనిపిస్తుంది అనే విషయం పక్కన పెడితే ఆ కనిపించినంత సమయం అనుష్క, నిత్యామీనన్ల మధ్య సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.ఇలాంటి పాత్రను చేసేందుకు ఒప్పుకున్నందుకు అనుష్కను అభినందించాల్సిందే అంటున్నారు సినీ వర్గాల వారు.