పవర్స్టార్ పవన్ కళ్యాణ్ మీడియాకు దూరంగా ఉంటూ చాలా సింపుల్గా గడిపేస్తూ ఉంటాడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ పేజీలు చాలా ఉన్నప్పటికి ఆయన మాత్రం ఫేస్బుక్ మరియు ట్విట్టర్ వంటి మాధ్యమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు.
అయితే ఇన్నాళ్లకు అభిమానులతో దగ్గరగా ఉండేందుకు పవన్ ట్విట్టర్లో జాయిన్ అయ్యాడు.
కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాను ప్రారంభించాడు.
అందరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని తన మొదటి ట్విట్లో పేర్కొన్నాడు.పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో జాయిన్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇతర హీరోల మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా తన చిత్రాల వివరాలను ఇకపై ట్వీట్ చేయాలని కోరుకుంటున్నారు.పవన్ ట్విట్టర్లో జాయిన్ అయిన కొన్ని గంటల్లోనే ఆయన్ను ఫాలో అయ్యేవారు వేలల్లో అయ్యారు.
గంటల వ్యవధిలోనే 60 వేల మంది ఫాలోవర్స్ను ఏర్పర్చుకున్నాడు.కేవలం ఒక్క ట్విట్తో పవన్ ట్విట్టర్లో భారీ క్రేజ్ను దక్కించుకున్నాడు.ట్విట్టర్లో పవన్ను ఇప్పటికే 14 వేల మంది తమ ఫెవరేట్ జాబితాలోకి చేర్చుకున్నారు.10 వేల మంది పవన్కు రీ ట్వీట్ చేశారు.