చాలామంది వారి సొంత ప్రాంతాల్లో ఉద్యోగాలు లేక వేరే ప్రాంతాలకు లేదా వేరే దేశాలకు వలస వెళ్లడం మనం సహజంగానే చూస్తూ ఉంటాం.అలాగే ఆఫ్రికా ఖండం నుండి కొందరు పనుల కోసం చైనా దేశానికి వలస వెళ్లారు.
అయితే ఆఫ్రికా( Africa ) నుంచి ఉపాధి పనుల కోసం వచ్చిన వారిని చైనాలో పనిచేస్తున్న ఓ కంపెనీ మేనేజర్ బెల్టుతో తీవ్రంగా కొట్టిన సంఘటన ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో తెగ వైరల్ గా మారింది.
వీడియోలో ఓ చైనా వ్యక్తి ప్రదర్శించిన జాత్యహంకార మిషన్ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది ఈ వీడియో.
ఓ ప్రముఖ జర్నలిస్ట్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ చేయగా అది., తక్కువ సమయంలోనే వైరల్ గా మారింది.ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన కార్మికులను చైనా కంపెనీ( Chinese company )కి చెందిన మేనేజర్ ట్రాన్స్ – అట్లాంటిక్ బానిసలు లాగా వారిని పరిగణిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
ఇక ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో ఓ ఇద్దరి యువకులు కంటైనర్ లో కూర్చొని ఉండగా వారిని తిడుతూ బెల్టుతో ఇష్టానుసారంగా కొట్టడం గమనించవచ్చు.
చైనా కంపెనీ మేనేజర్ ఇలా ప్రవర్తించడం ద్వారా ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు తలకు గాయం కాకుండా ఆ యువకుడు తన చేతిని అడ్డంగా పెట్టడం గమనించవచ్చు.వారు తమని కొట్టొద్దని ఎంత వేడుకున్నప్పటికీ కూడా ఆ మేనేజర్ ఎలాంటి కనికరం చూపించకుండా ఇష్టం వచ్చినట్టు బెల్టుతో కొట్టాడు.ఒక చివరగా ఓ యువకుడుని కాలితో తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
దీంతో ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ జాత్యహంకారాలు చూపించిన చైనా మేనేజర్ ను వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున విమర్శల వెళ్లువలు ఎక్కువయ్యాయి