టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు.మిగ్జామ్ తుఫాను ప్రభావానికి గురైన పలు జిల్లాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.
రెండు రోజులపాటు చంద్రబాబు పర్యటన కొనసాగనుండగా వరద ప్రభావిత ప్రాంత ప్రజలను, నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు.
ఇందులో భాగంగా ఇవాళ బాపట్ల, ప్రకాశం మరియు గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన ఉండనుంది.వేమూరు, పొన్నూరు, బాపట్ల, తెనాలి నియోజకవర్గాల్లో పర్యటించి పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించనున్నారు.ఇవాళ రాత్రికి బాపట్లలోనే బస చేయనున్న చంద్రబాబు రేపు పర్చూరు, పత్తిపాడులో పర్యటించనున్నారు.