తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా పేరుపొందిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాంతరం సత్తెనపల్లి నియోజకవర్గంలో టిడిపి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు కోడెల శివప్రసాద్ , ఆయన తనయుడు శివరామ్.వారినే టార్గెట్ చేసుకుని వైసిపి ప్రభుత్వం అనేక చర్యలకు దిగడం, శివప్రసాద్ మరణం తర్వాత కోడెల శివరాం( Kodela Sivaram ) కూడా అనేక కేసుల్లో ఇరుక్కోవడం వంటివి జరిగాయి.
![Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Kodela Sivaram, Ysrcp-Politics Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Kodela Sivaram, Ysrcp-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/04/sattenapalli-TDP-YSRCP-ap-government-jagan-ap-CM-Jagan-ap-government.jpg)
ఇక రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనతో కోడెల వారసుడు శివరాం ఉన్నారు.అయితే రాబోయే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కే అవకాశం లేనట్టుగానే ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తగ్గట్లుగానే ఇటీవల టిడిపిలో చేరిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఈ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు .ఈయనకు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు సైతం సముకంగా ఉండడంతో, కోడెల వారసుడి ఆవేదన అంతా అంతా కాదు.
![Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Kodela Sivaram, Ysrcp-Politics Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Kodela Sivaram, Ysrcp-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/04/sattenapalli-TDP-YSRCP-ap-government-jagan-ap-CM-Jagan-ap-government-CB.jpg)
ఇటీవల చంద్రబాబు( Chandrababu Naidu ) ఈ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కీలక నేతలంతా హాజరయ్యారు .కానీ ఆ సమయంలో అందుబాటులో లేని కారణంగా కోడెల శివరాం ఆ సమావేశానికి రాలేదు.ఆ సమావేశం ప్రారంభానికి ముందే ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన నేతలు అక్కడ కోడెల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మర్చిపోయారు.
అయితే ఈ వ్యవహారంపై కోడెల శివరం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.మీడియా ముందుకు వచ్చి మరి తన ఆవేదనను వ్యక్తం చేశారు. మేము చేసిన నేరం ఏమిటి ? పార్టీ కోసం ప్రాణాలర్పించిన నాయకుడిని విమర్శిస్తారా ఇదెక్కడి న్యాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
![Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Kodela Sivaram, Ysrcp-Politics Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Kodela Sivaram, Ysrcp-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/04/Kodela-Sivaram-Chandrababu-Naidu-sattenapalli-TDP-YSRCP-ap-government.jpg)
మా నాన్న కోడెల శివప్రసాద్( Kodela siva praasad rao ) పేరు వినిపించకుండా సత్తెనపల్లెలో కుట్ర జరుగుతోందని , దీని వెనుక ఎవరున్నారో నాకు ఇప్పుడే తెలియాలి అంటూ శివరాం ఫైర్ అయ్యారు.అధికార పార్టీ నుంచి తనకు ఎన్ని రకాలు ఇబ్బందులు ఎదురైనా, అన్ని భరిస్తున్నామని , తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు న్యాయం చేయాలని శివరాం కోరుతుండగా, రాబోయే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదనే సంకేతాలు వెలబడడంతోనే కోడెల వారసుడు ఈ విధంగా ఫైర్ అవుతున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.