తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర జోడి రష్మీ గౌతమ్,సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు బుల్లితెరపై ఈ జంటకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
అంతేకాకుండా వీరిద్దరి పెళ్లి విషయంలో వచ్చిన వార్తలు మరే ఇతర సెలబ్రిటీ జంటల విషయంలో కూడా వచ్చి ఉండవు అనడంలో ఎటువంటి అతియో శక్తి లేదు.వీరు రియల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా కలిసిపోవాలని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు.
అంతేకాకుండా వీరు ఎక్కడికి వెళ్లినా కూడా వారి పెళ్లికి సంబంధించిన వార్తలే వినిపిస్తూ ఉంటాయి.
కాగా ఇప్పటికే మల్లెమాల వీరిద్దరిని కలుపుతూ రెండు మూడు సార్లు స్టేజిపై పెళ్లి కూడా చేసిన విషయం తెలిసిందే.
కానీ అదంతా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే అని తెలియడంతో ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు.కేవలం వీరు మాత్రమే కాకుండా జబర్దస్త్ కి సంబంధించిన ఏ ఒక్క కమెడియన్ ఇంటర్వ్యూలకు రష్మీ, సుధీర్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా రష్మీ ఒక ఇంటర్వ్యూలో భాగంగా సుధీర్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.రష్మీ తాజాగా నటించిన చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్.ఇందులో నందు హీరోగా నటించిన విషయం తెలిసిందే.
నవంబర్ 4 న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.ఈ సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా పాల్గొన్న రష్మీ సుధీర్ గురించి పలు వ్యాఖ్యలు చేసింది.బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి సుధీర్ వచ్చారు.
మీరు ఇన్వైట్ చేశారా అని సదరు యాంకర్ రష్మీ ని ప్రశ్నించగా.వెంటనే స్పందించిన రష్మీ,సుధీర్ ను పిలవాల్సిన అవసరం నాకు లేదు.
నేను పిలవకపోయినా సుధీర్ వస్తాడు.మా మధ్య అంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది.
అందుకే నేను సుధీర్ ని పిలవలేదు. సుధీర్ కు నా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ తెలుసు పిలవకపోయినా వస్తాడు అన్న విషయం నాకు తెలుసు కాకపోతే నందు సుధీర్ ని ఇన్వైట్ చేశాడు అని చెప్పుకొచ్చింది రష్మీ.