టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఫ్యాన్స్ వార్ కొత్తేం కాదు.చాలా సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ వార్ ఉన్నా సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఫ్యాన్స్ వార్ అంతకంతకూ పెరగడంతో పాటు పెద్ద సినిమాల భవిష్యత్తు ప్రస్తుతం సోషల్ మీడియా చేతిలో ఉంది.
సోషల్ మీడియా ద్వారానే పెద్ద సినిమాలు అయినా చిన్న సినిమాలు అయినా ప్రేక్షకులకు చేరువవుతున్నాయి.అయితే ఇదే సమయంలో రిలీజ్ రోజునే పెద్ద సినిమాలకు నెగిటివ్ గా ప్రచారం జరుగుతోంది.
టాక్ తో సంబంధం లేకుండా పెద్ద సినిమాలకు కొంతమంది కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.ఈ విధంగా నెగిటివ్ ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లలో మెజారిటీ అకౌంట్లు ఫేక్ అకౌంట్లు కావడం గమనార్హం.
ప్రస్తుతం ఫ్యాన్స్ వార్ వల్ల యావరేజ్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద హిట్టయ్యే పరిస్థితులు ఏ మాత్రం కనిపించడం లేదు.ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ సమయంలో ఒక స్టార్ హీరో టార్గెట్ గా ట్రోలింగ్ జరిగింది.
ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలపై కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది.
మరీ దారుణమైన విషయం ఏమిటంటే తమ ఫేవరెట్ హీరోల ఫోటోలు కాకుండా మరో స్టార్ హీరో ఫోటో పెట్టుకుని కొంతమంది ఈ తరహా ట్రోలింగ్ చేస్తుండటం గమనార్హం.స్టార్ హీరోలంతా కలిసికట్టుగా అభిమానులకు సూచనలు చేస్తే మాత్రమే ఈ ఫ్యాన్స్ వార్ ఆగిపోయే పరిస్థితులు అయితే ఉంటాయి.
ఈ ఫ్యాన్స్ వార్ వల్ల ప్రస్తుత కాలంలో నిర్మాతలు భారీ మొత్తంలో నష్టపోయే పరిస్థితులు ఇండస్ట్రీలో నెలకొన్నాయి.అర్బన్ ఆడియన్స్ తో పాటు రూరల్ ఆడియన్స్ పై కూడా ఈ ప్రభావం పడనుంది.ఏపీలో టికెట్ రేట్లు పెరిగిన తర్వాతే ఈ ఫ్యాన్స్ వార్ మరింత పెరగడం చర్చనీయాంశమైంది.