అమరావతి: ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి టీడీపీ అడుగడుగునా అడ్డుకుంది.
శాసనసభ లో టిడిపి సభ్యులు అసభ్యంగా ప్రవర్తించారు.టీడీపీ నేతలు తమ ప్రవర్తన పై పునరాలోచన చేసుకోవాలి.
పబ్లిసిటీ కోసమే టిడిపి సభ్యులు సభలో ఈ తరహాలో ప్రవర్తించారు.గవర్నర్ పార్టీకి సంబంధించిన వ్యక్తా అనేది టిడిపి ఆలోచించాలి.
గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలినప్పుడే శాసన సభలో వారు వ్యూహం అర్ధం అయ్యింది.అమరావతి లో రైతులు ఎక్కడున్నారు.వారు ఎప్పుడైనా వ్యవసాయ ఇబ్బందులు గురించి మాట్లాడారా.ఎప్పుడూ భూముల విలువ గురించి మాత్రమే వారు మాట్లాడేది.
గవర్నర్ ప్రసంగాన్ని మేము సమర్దిస్తున్నాం.
సభలో టిడిపి అజెండా ఏమిటో అర్థం అయ్యింది.
బీఏసీ సమావేశంలో ను టిడిపి రాజకీయాలు కోసమే ప్రయత్నాలు చేసింది.వైసీపీ 20 అంశాలపై చర్చకు అంశాలను ప్రస్తావించింది.
టీడీపీ నుంచి కూడా 20 అంశాలే వచ్చాయి.రేపు దివంగత మంత్రి గౌతమ్ రెడ్డికి సంతాపం.10 తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం.11 తేదీన బడ్జెట్ ప్రసంగం ఉంటుంది.