వైసీపీ అసమర్థ పాలన తో రాష్ట్ర ఖజానా దివాళా తీసే పరిస్థితి ఏర్పడిందని,ఉద్యోగుల ఆందోళన, గుడివాడ క్యాసినో వివాదం నుంచి దృష్టి మళ్లించేదుకు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రీయ వచ్చిందని మాజీ mla బొండా ఉమా అన్నారు ఉద్యోగుల కు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం.ప్రజలపై భారాలు వేస్తోందని,చెత్తపై పన్నువేసిన చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు.
జీవో 225 పేదల మెడకు ఉరితాడు గా మారిందని టిడిపి హయాంలో జీవో 74 ద్వారా ప్రభుత్వం కట్టిన ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ కల్పించామన్నారు ఎపుడో కట్టిన ఇళ్లకు .డబ్బులు కట్టాలని ఇప్పుడు ఇళ్లకు నోటీసులు ఇస్తున్నారని కట్టకపోతే ఇల్లు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని బెదిరించడం సరికాదన్నారు ఎవరు డబ్బులు కట్టవద్దని.వచ్చేది టిడిపి ప్రభుత్వమేనని అప్పుడు ఉచితంగా సర్వ హక్కులు కల్పిస్తామన్నారు ఎన్టీఆర్ పుట్టింది నిమ్మకూరు లో అయితే విజయవాడ జిల్లా కు పేరు పెడుతున్నారని విజయవాడ జిల్లా కు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు టిడిపి అధికారంలోకి రాగానే ప్రజలు అభిప్రాయం తీసుకొని జిల్లాల ఏర్పాటు లో తప్పులు సరిదిద్దుతామని బోండా ఉమాపెర్కొన్నారు
.