టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలతో అదే రీతిలో డిస్ట్రిబ్యూటర్లు మరియు థియేటర్ యజమానులతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డి.ఎన్.
వి ప్రసాద్, ఆదిశేషగిరిరావు, డి.వి.వి.దానయ్య లతో ఏపీ మంత్రి పేర్ని నాని సమావేశం అవ్వడం జరిగింది.ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలతో పాటు ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానం.ఇంకా పలు విషయాలపై.ఈ సమావేశంలో చర్చించారు.సమావేశం అనంతరం.
నిర్మాత సి.కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ విధానం.తామే ప్రభుత్వాన్ని అడిగినట్లు క్లారిటీ ఇచ్చారు.
అదేరీతిలో నాలుగు షోలు 12 గంటల లోపు పూర్తి చేయడంపై కూడా చర్చించినట్లు తెలిపారు.ఇంకా విద్యుత్ బిల్లులు అంశం.
థియేటర్ లో 100% ఆక్యుపెన్సీ వంటి విషయాలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పుకొచ్చారు.ఇండస్ట్రీ సమస్యల విషయంలో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు త్వరలోనే సీఎం జగన్ తో భేటీ కాబోతున్నట్లు పేర్కొన్నారు.
కచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఇండస్ట్రీ సమస్యల విషయంలో పూర్తి సహకారం అందించడానికి రెడీగా ఉన్నట్లు ఇదే సందర్భంలో నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు స్పష్టం చేశారు.ఆన్లైన్ టికెట్ వ్యవస్థ అనేది పెద్ద సమస్య కాదని.
ఈ సమావేశంలో కొంతమంది నిర్మాతలు చెప్పుకొచ్చారు.మరోసారి ప్రభుత్వం తో భేటీ కాబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.