ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కుటుంబాల ఉసురు పోసుకుంటున్నాడు.. వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు.. ?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే నీళ్లు, నిధులు మనవే అన్నారు కానీ ఇవన్నీ దొరల సొంత చేసుకున్నారు అంటూ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి పై వైఎస్ షర్మిళ విరుచుకుపడ్డారు.

 Ys Sharmila Shockigng Comments On Telangana Cm Kcr, Ys Sharmila, Key Comments,-TeluguStop.com

ఇక ప్రస్తుతం కరోనా నేపధ్యంలో అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సింగ్ స్టాఫ్ చాలా తక్కువగా ఉందని, అంతే కాకుండా గతంలో సెలెక్ట్ అయిన స్టాఫ్ నర్సులకు పోస్టింగులు ఇవ్వకుండా నానబెట్టడం దారుణమని విమర్శించారు.

ఇక గతంలో సెలెక్ట్ అయిన స్టాఫ్ నర్సులకు పోస్టింగులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు వైయస్ షర్మిల.ఇప్పటికే తెలంగాణలో ఉద్యోగాలు రాక బాధ పడుతున్న 658 కుటుంబాల ఉసురు పోసుకోంటున్న ముఖ్యమంత్రి మిగతా ఉద్యోగాలతో పాటుగా, వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని కోరారు.ఇకపోతే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ఆయుష్మాన్ భారత్ లో రూ.5 లక్షల కవరేజ్ మాత్రమే అందుతుండగా, ఆరోగ్యశ్రీలో రూ.13 లక్షల కవరేజ్ అందుతుందని దీని వల్ల తెలంగాణ ప్రజలందరికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube