టాలీవుడ్ సినిమాలలో ప్రస్తుతం ఓ రేంజ్ కనిపిస్తుంది.ఎక్కువగా బాలీవుడ్ ను మించి కథలను తెరకెక్కిస్తున్నారు మన దర్శకులు.
ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ ను బాగా పాపులర్ చేస్తున్నారు.ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ సినిమాలలో నటించగా.
ఇకపై ఎక్కువ పాన్ ఇండియా సినిమాలకే ఆసక్తి చూపుతున్నారట.ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరోల పై బాలీవుడ్ దర్శకులే కాకుండా వేరే భాష దర్శకులు కూడా దృష్టి చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉండగా.కే జి ఎఫ్ సినిమా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ‘సలార్’ అనే సినిమాను తెరకెక్కించనున్నారు.
ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైన్ గా తెరకెక్కనుంది.సింగరేణి బొగ్గు గనులో ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.అంతేకాకుండా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆది పురుష్‘ సినిమా లో నటించనున్నాడు.
మలయాళీ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ సినిమాను పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కగా ఈ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించాడు.ప్రస్తుతం ఈ సినిమా తెలుగులోని రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమాను తెలుగులో కూడా కోలీవుడ్ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించనున్నారు.ఈ సినిమాలో హీరో చిరంజీవి నటిస్తున్నాడు.
‘భారతీయుడు 2‘ సినీ దర్శకుడు శంకర్ ఈ సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉండగా.ఈ సినిమా తర్వాత టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు.ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు.అంతేకాకుండా మరో కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి త్వరలోనే టాలీవుడ్ యంగ్ స్టార్ రామ్ తో ఓ సినిమా చేయనున్నాడు.
చాలామంది టాలీవుడ్ హీరోలను ఇతర భాషల హీరోలు బాగా ఆసక్తి చూపుతున్నారు.