స్మార్ట్ ఫోన్ లు వచ్చాక.ఇంట్లోనే కూర్చొని లక్షలకుపైగా సంపాదిస్తున్నారు నెటిజనులు.
కేవలం కొన్ని నిమిషాల వీడియో లతోనే కొన్ని లక్షలు తెచ్చుకుంటున్నారు.వాళ్లకు నచ్చిన పద్ధతిలో వీడియోలను తీస్తూ, సమాజానికి అవసరమయ్యే విషయాలను తెలుపుతూ సోషల్ మీడియా లో యూట్యూబ్ లో ఎంతో మంది యూజర్లు ఆన్లైన్ సంపాదన చేస్తున్నారు.
ఇలాగే ఓకుటుంబం కూడా తాము చేసే వీడియోల ద్వారా లక్షలకుపైగా సంపాదిస్తున్న విషయం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
గుజరాత్ లోని పోర్ బందర్ సమీపంలో ని గ్రామానికి చెందిన రమ్దె, భారతి. వీళ్లు ఇంతకుముందు బ్రిటన్ లో ఉండేవారు.తాము పై స్థాయి చదువులు చదివి మంచి ఆదాయం తో ఉద్యోగాలు చేసేవారు.
కానీ రమ్దె కు తన గ్రామం లో ఉండటానికి ఆసక్తి ఉండటమే కాకుండా పైగా తల్లితండ్రులకు ఒక్కడే సంతానం కాగా ఒంటరిగా ఉన్నారంటూ 2016లో తన కుటుంబంతో గ్రామానికి వచ్చారు.
కాగా తమ గ్రామంలో ఉన్న కొన్ని వ్యవసాయ పద్ధతులు, పశు పోషకాలు, పలురకాల విషయాలను సోషల్ మీడియాలో యూట్యూబ్ ద్వారా వీడియోలు చేస్తూ షేర్ చేసేవారు.అలా రోజు రోజుకు తన వీడియోలకు మరింత పాపులారిటీ పెరుగుతూ వచ్చేది.దీంతో మూడు లక్షలకు పైగా ఫాలోయింగ్ ను తెచ్చుకున్నాడు.
అతి తక్కువ సమయంలో ఎక్కువ మోతాదులో అతని యూట్యూబ్ ఛానల్ మరింత జోరుగా సాగింది.అదే తరహా తో వీళ్లు రోజురోజుకు వీడియోలను పోస్ట్ చేస్తూ ఉండేవారు.కాగా వీటివల్ల వీళ్ళకి నెలకు రూ.5 లక్షల వరకు ఆదాయం వచ్చేది.ప్రస్తుతం ఏడు లక్షలకు పైగా సబ్ స్క్రై బర్ లు ఉన్నారని తెలిపారు.రోజు రోజుకి 1000 మంది సబ్ స్క్రైబర్ లు వస్తుంటారని రమ్దె తెలిపారు.