మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో మరోసారి తన సక్సెస్ ట్రాక్ను కంటిన్యూ చేసేందుకు సాయి ధరమ్ తేజ్ రెడీ అవుతున్నాడు.
ఈ క్రమంలో పూర్తి యూత్ఫుల్ సబ్జెక్ట్గా సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు తేజు.కాగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చూడగా, కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే నేరుగా ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ ప్రస్తుతం థియేటర్లు తెరుచుకునేందుకు రెడీ అవుతుండటంతో ఈ సినిమాను వెండితెరపైనే రిలీజ్ చేసేందుకు తేజు అండ్ టీమ్ నిర్ణయించుకున్నారు.
అయితే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ తొలుత భావించింది.కానీ పండగకు అరడజను సినిమాలు రిలీజ్కు రెడీ కావడంతో తేజు తన సినిమాను పండగకు కాకుండా ముందుగానే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ క్రమంలోనే క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను క్రిస్మస్కు రిలీజ్ చేస్తుండటంతో ఆ సమయంలో తేజు ఒక్కడే బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాడు.
దీంతో సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం సోలోగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.ఈ సినిమాలో తేజు సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్గా నటిస్తోండగా, ఈ సినిమాను సుబ్బు అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు.
బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.