చిన్నప్పుడు సామాన్య శాస్త్రంలో రెండు సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయని, రెండు విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయని చదివే ఉంటాం.నిజ జీవితంలో అజయ్ దేవగన్, కాజోల్ లను చూస్తే ఈ మాట నిజమేనేమోనని అనిపిస్తుంది.
ఆలోచనల్లో కానీ, మనస్తత్వాల్లో కానీ, ప్రవర్తనలో కానీ అజయ్ దేవగన్, కాజోల్ పూర్తిగా భిన్నం.కాజోల్ ఎల్లప్పుడూ నవ్వుతూ సరదాగా కనిపిస్తూ ఉంటారు.
అజయ్ దేవగణ్ మాత్రం కాస్త ముభావంగా ఉంటాడు.
అయితే వీళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.20 సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది.అజయ్, కాజోల్ వివాహం జరిగిన సమయంలో చాలామంది వీరిద్దరి బంధం ఎక్కువ కాలం నిలవదని భావించారు.
అజయ్, కాజోల్ మాత్రం అలా భావించిన వాళ్ల అంచనాలను అబద్ధం చేస్తూ సంతోషంగా జీవితాన్ని గడిపారు.వీరికి ఇద్దరు సంతానం కాగా వాళ్ల పేర్లు నైస్,యుగ్.20 ఏళ్లు ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా ఆనందంగా గడిపిన వీళ్లు ఇప్పుడు పిల్లల కోసం వేరుగా ఉండాలని నిశ్చయించుకున్నారు.
నైసా గత కొన్నేళ్లుగా సింగపూర్ లో చదువుకుంటూ ఉండగా కొన్ని రోజుల క్రితం కరోనా, లాక్ డౌన్ వల్ల ఇంటికి వచ్చింది.
అయితే సింగపూర్ లో కరోనా విజృంభణ తగ్గడం వల్ల అక్కడ పాఠశాలలు, కాలేజీలు రీ ఓపెన్ అవుతున్నాయి.నైసా చదువుకోసం సింగపూర్ కు వెళ్లాల్సి ఉండగా ఆమెతో పాటు కాజోల్ కూడా అక్కడికి వెళుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో నైసాను ఒంటరిగా ఉంచడానికి కాజోల్ ఏ మాత్రం ఇష్టపడటం లేదు.అజయ్ మాత్రం ఇండియాలోనే ఉంటూ సినిమాలలో నటిస్తూ యుగ్ తో కాలం గడుపుతున్నాడు.20 ఏళ్లుగా దూరంగా ఉండని ఈ జంట నైసా వల్ల కొంతకాలం వేరుగా ఉండాల్సి వస్తోంది.