యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో ఆల్ ఇండియా స్టార్ అయిన విషయం తెల్సిందే.ఆయన ప్రస్తుతం రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు.
రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.ఇదే సమయంలో ప్రభాస్ మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు.
పాన్ వరల్డ్ లెవల్లో ఆ సినిమా ఉంటుందని చెబుతున్నారు.ఈ సమయంలో ప్రభాస్ నిన్న ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తానంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.
అప్పటి నుండి ట్విట్టర్లో ప్రభాస్ పేరు జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతుంది.ఉదయం సరిగ్గా 7 గంటల 11 నిమిషాలకు ప్రభాస్ ఆ సస్పెన్స్ను రివీల్ చేశాడు.
ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలు ఉన్నా కూడా ప్రభాస్ అంతా అనుకున్నట్లుగా తన కొత్త సినిమాను ప్రకటించాడు.ఆదిపురుష్ అనే విభిన్నమైన టైటిల్తో ప్రభాస్ ఉదయాన్నే అభిమానులు పండుగ చేసుకునే పోస్టర్ ను పోస్ట్ చేశాడు.
చెడుపై మంచి సాదించిన విజయం అనే ట్యాగ్ లైన్ తో సినిమా రాబోతుంది.బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ అద్బుతమైన సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.
ఓమ్ రౌత్ ఛారిత్రాత్మక చిత్రాలు తీయడంలో మంచి పేరున్న దర్శకుడు.ఆయన దర్శకత్వంలో సినిమా అంటే ఖచ్చితంగా ప్రభాస్ ఒక అద్బుతాన్ని ఆవిష్కరించడం ఖాయం అంటున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
నాగ్ అశ్విన్ మూవీ వచ్చే ఏడాదిలో ప్రారంభం అవ్వనుంది.అయితే ఆ సినిమాతో సమాంతరంగా ఆదిపురుష్ సినిమా ఉంటుందా అనేది చూడాలి.బాహుబలి తర్వాత బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది.
ఎట్టకేలకు ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఉండబోతుంది.హిందీలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను దేశంలోని పలు భాషల్లో డబ్ చేసే అవకాశం ఉంది.
టీ సిరీస్ నిర్మాణంలో దాదాపుగా 500 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా రూపొందబోతున్నట్లుగా చెబుతున్నారు.పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.