ఉలిక్కిపడ్డ న్యూజిల్యాండ్..మళ్ళీ కధ మొదలయ్యిందిగా...!!!

అమెరికాలో కరోనా ఎంట్రీ ఇచ్చి అల్లకల్లోలం సృష్టిస్తున్న క్రమంలో అత్యధికంగా దాని ప్రభావం అమెరికా ఆర్ధిక రాజధానిపై చూపించింది.దాంతో న్యూయార్క్ ఘోరమైన పరిస్థితులని ఎదుర్కుంది.

ఇప్పటికీ న్యూయార్క్ కరోనా కేసులతో కొట్టి మిట్టాడుతోంది.న్యూయార్క్ తరువాత అంతగా కరోనా ప్రభాలిన ప్రాంతం న్యూజిల్యాండ్.

న్యూజిల్యాండ్ లో కూడా కరోనా కేసుల ఉదృతి ఒక్క సారిగా పెరిగిపోవడంతో అక్కడి ప్రధాని ఆర్దేర్న్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి, నియమ నిభందనలు ప్రజలు అందరూ అనుసరించేలా కరోనాని తరిమి కొట్టేలా విశ్వ పయత్నం చేశారు.ఫలితంగా అమెరికా వ్యాప్తంగా కేవలం ఒక్క న్యూజిల్యాండ్ నగరంలో మాత్రమే కరోనా జీరో కేసులు నమోదు అయ్యాయి.

అక్కడ కరోనాని పూర్తిగా నిర్మూలించడాని ఎంతో కష్టపడింది స్థానిక ప్రభుత్వం.ఇదిలాఉంటే తాజాగా న్యూజిల్యాండ్ లో మళ్ళీ కరోనా అడుగుపెట్టింది.

Advertisement

ఇద్దరు వ్యక్తులకి కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రధాని కంగారు పడుతున్నారు.పాజిటివ్ కేసులు నమోదైన ఇద్దరు ఇటీవల కాలంలో యూకే నుంచీ అనారోగ్యంతో బాధపడుతున్న తమ తల్లి తండ్రులని చూడటానికి న్యూజిల్యాండ్ వచ్చినట్టుగా తెలుస్తోంది.

తాజాగా రెండు కేసులు నమోదు అయ్యాయని వార్త తెలియగానే ఒక్కసారిగా న్యూజిల్యాండ్ వాసులు ఉలిక్కిపడ్డారు.ఈ హటాత్ పరిణామంతో ఒక్క సారిగా కంగారు పడిన ప్రధాని న్యూజిల్యాండ్ వాసులకి హేచరికలు జారీ చేశారు.

ఎవరైనా న్యూజిల్యాండ్ వాసులు విదేశాల నుంచీ వస్తే ఎంతో జాగ్రత్త గా ఉండాలని తెలిపారు.ఇలాంటి వారి వలన మళ్ళీ కరోనా ప్రభలే అవకాశం ఉంది కాబట్టి వారు వచ్చిన క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని వారిని అనుమతించాలని తెలిపారు.

ప్రస్తుతం ఈ ఇద్దరి నుంచీ ఇంకెవరికైనా కరోనా సోకిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు