తెలుగులో టాలీవుడ్ ప్రముఖ హీరోలు విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన టువంటి మల్టీస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రం ద్వారా నటిగా సినీ పరిశ్రమకు పరిచయమైన టువంటి తేజస్వి మడివాడ గురించి తెలియని వారు ఉండరు.అయితే ఈ అమ్మడు బాగా పాపులర్ అయినటువంటి తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కాగా ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.ఇందులో భాగంగా తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో రోజురోజుకీ తన ఫాలోవర్స్ సంఖ్యని పెంచుకుంటోంది.
అయితే తాజాగా తేజస్వి మడివాడ పొట్టి నిక్కరు ధరించి, మత్తెక్కించే చూపులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.అంతేగాక ఈ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.
అయితే ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన అతి కొద్ది కాలంలోనే లక్షలకి పైగా లైకులు, కామెంట్లు వచ్చాయి.మరోపక్క తేజస్వి మడివాడ ఫోటోలు చూసినటువంటి నెటిజన్లు అయ్యో తేజస్వి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందని అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ అమ్మడు ప్రస్తుతం ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క జీ తెలుగు లో ప్రసారమయ్యే టువంటి ఓ షోకి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తోంది.కాగా ఈ అమ్మడు గతంలో ప్రముఖ యాంకర్ మరియు సినీ నిర్మాత అయినటువంటి ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా నటించినటువంటి జతకలిసే అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తేజస్వి ఆశలు అడియాశలు అయ్యాయి.
అయితే ప్రస్తుతం పలు టాలీవుడ్ చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.