మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ ‘ప్రతి రోజూ పండగే’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.తేజు కెరీర్ ఫేడవుట్ అవుతున్న సమయంలో ఈ సినిమా సక్సెస్, అతడికి మంచి బూస్ట్ ఇచ్చింది.
దర్శకుడు మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రావడంతో ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.
ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లు సాధించింది.
కాగా తాజాగా ఈ సినిమాను బుల్లితెరపై టెలికాస్ట్ చేశారు.స్టార్ మా ఛానల్లో ఈ సినిమాను ప్రసారం చేయగా దీనికి 15.3 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.ఒక మీడియం రేంజ్ చిత్రానికి ఈ మేర టీఆర్పీ రేటింగ్ రావడం నిజంగా గొప్ప విషయమే.
అయితే ఫ్యామిలీ కంటెంట్ పుష్కలంగా ఉన్న చిత్రం కావడంతో ఆడియెన్స్ ఈ సినిమాను ఎక్కువ సంఖ్యలో చూసినట్లు తెలుస్తోంది.
పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్గా నటించగా సత్యరాజ్, రావు రమేష్లు కీలక పాత్రల్లో నటించారు.
మొత్తానికి తేజుకు ఈ సినిమా అదిరిపోయే బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి.