నల్లదనం, డబ్బుని అక్రమ మార్గంలో విదేశాలకి తరలించాడనే అభియోగాలతో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ భర్త రాబర్త్ వాద్రా నిన్న సాయంత్రం నుంచి ఈడీ విచారణ ఎదుర్కొంటున్నాడు.మరల తాజాగా ఈడీ రాబర్త్ ని విచారించేందుకు సిద్ధం అయ్యింది.
దేశ రాజకీయాలలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ వైరం తీవ్రమవుతున్న తరుణలో జరుగుతున్నా ఈ విచారణపై దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తుంది.నిన్న సాయంత్రం ఆరు గంటల పాటు ఏకంగా విచారణ ఎదుర్కొన్న వాద్రా మరల ఈ రోజు ఈడీ విచారణ కోసం సిద్ధమయ్యాడు.
మనీ లాండరింగ్ గురించి ఈ రోజు వాద్రాని ప్రశ్నించడానికి ఈడీ ఇప్పటికే 28 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.ఇదిలా వుంటే ఈడీ విచారణ అంతా తనని రాజకీయంగా దెబ్బ తీసేందుకే అని బీజేపీపై విమర్శలు చేసిన ప్రియాంకా గాంధీ ఈడీ అభియోగాలలో ఎలాంటి వాస్తవాలు లేవని, దీనిలో తన భర్త సచ్చీలుడుగా బయటకి వస్తాడని నమ్ముతూ అతనికి మద్దతుగా నిలబడింది.
ఈ రోజు రాబర్ట్ వాద్రాని ఈడీ ఎ విధంగా విచారించాబోతుంది అనేది చూడాలి.