తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగ ఖాళీల పై శ్వేత పత్రం విడుదల చేయాలని ,ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఖమ్మం జిల్లా టీడీపీ పార్టీ నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు, వాసి రెడ్డి రామానాధం డిమాండ్ చేశారు.ఖమ్మం కలెక్టరేట్ ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.అనంతరం జాయింట్ కలెక్టర్ కి మెమోరాండం అందజేశారు.2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రకటన చేసిన నిరుద్యోగ భృతి హామీనీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ వస్తే ఉద్యోగాలు దక్కుతాయి అని భావించిన నిరుద్యోగులు గత ఎనిమిదేళ్లగా నిరాశ, ఆవేదనలో ఉన్నారన్నారు.భవిష్యత్తు ప్రశ్నర్ధకంగా మారిందన్నారు.ఇప్పటకైనా ప్రభుత్వం తక్షణమే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి తక్షణమే ఉద్యోగాలు భర్తీ చెయ్యాలని, లేని పక్షంలో నిరుద్యోగ యువత కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.నిరుద్యోగ జీవితాలతో చెలగాటం ఆడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి నిరుద్యోగులు తడాఖా చూపించాలని ఉద్యమాలకు సమాయత్తం కావాలని నిరుద్యోగులకు పిలువు నిచ్చారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు సాన బోయిన శ్రీనివాస్ గౌడ్, నాగండ్ల.మురళి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు వంగాల .రామకోటి, ప్రధాన కార్యదర్శులు కీతినేని .హరీష్ ,గుత్తా సీతయ్య,మల్లాది.హనుమంతరావు,తాత.సుధాకర్ రావు,రావుట్ల.సత్యనారాయణ, పోట్లపల్లి.కోటేశ్వరరావు,వడ్డెమ్.
విజయ్ ,లేళ్ల.లక్ష్మణ్,పారిస్.
వెంకన్న,తాళ్ళూరి.శ్రీనివాస్,డివిషనల అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు పాల్గొన్నారు.