భవన నిర్మాణంలో ఉపయోగించే సామగ్రి 100 శాతానికి పైగా ధరలు పెరగడం తో క్రెడాయ్ ఖమ్మం అసోసియేషన్ అద్వరంలో ఖమ్మం నగరంలో నిరసన తెలుపుతూ ఈరోజు బంద్ పాటించారు,అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో అధికారి ఏవో మధుసూదన్ రావు కు క్రెడాయ్ ఖమ్మం అసోసియేషన్ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు .ఈ సందర్భంగా క్రెడాయ్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గతంలో మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి రేట్లు పెరిగేవని ,ఈ మధ్యకాలంలో వారానికి ఓసారి పెరుగుతున్నాయని దీని వల్ల సామాన్య ప్రజలకు పెనుభారంగా మారే అవకాశముందని అలాగే భవన నిర్మాణం రంగంపై కొన్ని కోట్ల కుటుంబాలు జీవిస్తున్నాయి అని , ప్రభుత్వాలకు అత్యధికంగా ఆదాయం సమకూర్చే రంగలలో భవన నిర్మాణ రంగం ఒకటని .
ఈ విధంగా రేట్లు పెంచుకుంటూ పోతే ఆర్థికంగా ప్రభుత్వానికి , ప్రజలకు , భవన నిర్మాణ రంగం వ్యవస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని కావున గమనించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేట్లను అదుపులోకి తీసుకురావాలని కోరారు .భవన నిర్మాణంలో ఉపయోగించే సామగ్రి రేట్లు పెరగడం వల్లన దాని ప్రభావము రియల్ ఎస్టేట్ పై కూడా చూపే అవకాశం ఉందన్నారు .ఈ కార్యక్రమంలో క్రెడాయ్ ఖమ్మం అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బండి కిషోర్ , సీహెచ్ వెంకటేశ్వర్లు , కౌటేపల్లి శ్రీకాంత్ , నంబూరి మురళి , నాగ రమేష్ , కాట్టా శేఖర్ , వడ్లమూడి గోపాల్ రావు , మహేంద్ర నాథ్ రెడ్డి , కమతం కమల్ , యల్లంకి శ్రీనివాస్ రావు , రాచకొండ ప్రవీణ్ , మన్నె భాస్కర్ , ఆకుల సతీష్ తదితరులు పాల్గొన్నారు .