ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు , శాంతిదూత , ప్రపంచ స్థాయిలో వేలాది అవార్డులు పొందిన సద్గురువులు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ ( జన్మదిన ) పుట్టినరోజు సందర్బంగా విడిఓస్ కాలనీ సాయిబాబా ధ్యాన మందిరంలో శుక్రవారం రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సీఐ అంజలి పాల్గొని ప్రారంభించి మాట్లాడారు .
మనిషి ఆనందం , ఆరోగ్యం మరియు ఆదర్శవంతమైన జీవితాన్ని పొందాలనుకుంటే యోగా చేయాలని , దీని వలన రోగనిరోధక శక్తి పెరిగి , శారీరక ఆరోగ్యం మెరుగుపడి మానసిక వత్తిడి తగ్గుతుందన్నారు .ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ యోగా , లాంగ్ సుదర్శన క్రియ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో ఒక భాగమని తెలియజేశారు .సత్సంగ్ భజన కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదాలను వితరన చేశారు .ఈ కార్యక్రమంలో యోగా టీచర్ జి.శ్రీనివాస్ రెడ్డి , టి.కోటేశ్వరరావు , బి.చైతన్య కిషోర్ , నయీమ్ , హరిబాబు , వేముల రామ్మోహన్ రావు , గోపాల్ , డాక్టర్ బాలు , ల్యాబ్ టెక్నీషియన్ సరిత , పీఆర్వో దినేశ్ , ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు .