ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 11 న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ ఖమ్మం జిల్లా అధికారి కొండపల్లి శ్రీధర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.బివైజెయూ అనే ప్రైవేటు సెక్టార్ నందు ఖమ్మం నగరంలో పని చేసేందుకు 25 బిజినెస్ డవలప్మెంట్ ట్రైనీ పోస్టులకు ఈ నెల 11 న జాబ్ మేళా ను ఖమ్మం జిల్లా ఉపాధి కార్యాలయం నందు నిర్వహిస్తున్నామని తెలిపారు.
కావున ఈ సదావకాశాన్ని 28 సంవత్సరముల లోపు గల ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న పురుష అభ్యర్థులు మాత్రమే సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనశాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలియజేశారు.సెలెక్ట్ అయినా యువకులకు నెలకు 20,000 రూపాయలు జీతం తో పాటు సదరు ట్రైనింగ్ కాలానికి అలవెన్సు కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూ కొరకు పేర్లు నమోదు చేపించుకోవాలని కోరారు.