ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్లుగా రాంనారాయణ, రవీంద్ర శేషు ఎన్నిక

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్( టి యు డబ్ల్యూ జే- ఐ జేయు) నేషనల్ కౌన్సిల్ మెంబర్లుగా ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టులు కట్టే కోల రాంనారాయణ, అమరవాది రవీంద్ర శేషు లు ఎన్నికయ్యారు.

ఇటీవల వీరిద్దరి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.

టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న రాం నారాయణ గత 30 ఏళ్లుగా పత్రిక రంగంలో పనిచేస్తున్నారు.ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి పత్రికలో సుధీర్ఘ కాలం గా పనిచేసి ప్రస్తుతం దృక్పథం సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.

అదేవిధంగా మరో నేషన్ కౌన్సిల్ మెంబర్ రవీంద్ర శేషు గత మూడు దశాబ్దాలుగా పత్రిక రంగంలో పని చేస్తున్నారు.ఉదయం, ఏపీ టైమ్స్, హాన్స్ ఇండియా దినపత్రికలో, హెచ్ఎంటీవీలో పనిచేసిన రవీంద్ర శేషు ప్రస్తుతం డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ దినపత్రికకు ఉమ్మడి జిల్లా బ్యూరో చీఫ్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నుంచి నేషనల్ కౌన్సిల్ మెంబర్లు గా ఎన్నికైన రాం నారాయణ, రవీంద్ర శేషు లనూ టి యు డబ్ల్యూ జే (ఐజేయు) ఖమ్మం జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు మైసపాపారావు, ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు, ఎలక్ట్రాన్ మీడియా జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కనకం సైదులు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు నర్వ నేని వెంకట్రావు, అక్రిడేషన్ కమిటీ మెంబర్ గోగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాటేటి వేణుగోపాల్ తదితరులు అభినందనలు తెలిపారు.

Advertisement
కార్మికులను బెల్టుతో ఇష్టానుసారం కొట్టిన చైనా వ్యక్తి.. వైరల్ వీడియో...?

Latest Latest News - Telugu News