ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన.. !

ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు పర్యటిస్తున్నారు.ఈ మేరకు నాయకన్ గూడెంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

 Visit Of Three Ministers In Khammam District.. !-TeluguStop.com

మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ముగ్గురు తొలిసారి జిల్లాకు వచ్చారు.కూసుమంచిలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ముగ్గురు మంత్రులు ప్రారంభించనున్నారు.

అక్కడి నుంచి పెద్ద ర్యాలీగా అమరవీరుల స్థూపం వద్దకు చేరుకోనున్నారు.అక్కడ నివాళులు అర్పించిన తరువాత ఖమ్మం పాత బస్టాండ్ లో మహాలక్ష్మీ పథకాన్ని మంత్రులు ప్రారంభించనున్నారు.

మరియు కొత్తగూడెం మరియు భద్రాచలం నియోజకవర్గాల్లో వీరు పర్యటించనున్నారని తెలుస్తోంది.మంత్రుల పర్యటన నేపథ్యంలో అటు అధికార యంత్రాంగంతో పాటు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే ముగ్గురికి రేవంత్ రెడ్డి కేబినెట్ లో పెద్ద పీట కల్పించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube