ఆగస్టులోగా సమీకృత కలక్టరేట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సమీకృత జిల్లా కార్యాలయాల భవన నిర్మాణ పనులు వచ్చే ఆగస్టులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.

గౌతమ్ అన్నారు.బుధవారం కలెక్టర్ నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రానైట్ ఫినిషింగ్, ఫ్లోరింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.ఇంటర్నల్ పెండింగ్ పనులు, మిగులు ప్లాస్టింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.

బాహ్య రహదారి, కాంపౌండ్ వాల్, గ్రీనరీ పనులు చేపట్టి పూర్తి చేయాలన్నారు.సానిటరీ, నీటి సరఫరా పనులను చేపట్టి, త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

Advertisement

ఇంకనూ సరఫరా కానీ మెటీరియల్ పై వెంటనే చర్యలు చేపట్టి, రెండు మూడు రోజుల్లో పొందేలా చర్యలు చేపట్టాలన్నారు.రోజువారీ పనుల పూర్తికి అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆయన అన్నారు.

కలెక్టర్ తనిఖీ సందర్భంలో ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, డిఇ చంద్రశేఖర్, జెఇ విశ్వనాధ్ తదితరులు వున్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News