ప్రపంచవ్యాప్తంగా 19 సంవత్సరాలుగా అనేక దేశాలలో ఆత్మహత్యల నివారణకై ఆత్మహత్యల నివారణా సంస్థ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది .ఇందులో భాగంగా ఖమ్మం నగరంలో కూడా గత అనేక సంవత్సరాలుగా కార్యక్రమాలను ఖమ్మం సైకియాట్రిక్ సొసైటీ మరియు ఐఎంఏ సంస్థ ద్వారా చేపడుతున్నది .ప్రతి సంవత్సరం ఒక నినాదంతో నిర్వహించే ఈ కార్యక్రమాలు సెప్టెంబర్ 1 నుండి 10 వరకు వారోత్సవాలుగా జరుపుకుంటారని అన్నారు .” ఆచరణ ద్వారా నమ్మకాన్ని కలిగించడం ” జరుగుతుందన్నారు .ఈ రోజు ఖమ్మం నగరం పెవిలియన్ గ్రౌండ్ నుండి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది .2022 సంవత్సరం అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంస్థ “ఆచరణ ద్వారా నమ్మకాన్ని కలిగించడం” నినదించిందని ఖమ్మం సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షులు డా॥సతీష్ బాబు తెలిపారు .ఆత్మహత్య అనేది సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య అన్ని దీనిని కలసికట్టుగా ఉండి ఎదుర్కోవచ్చు .అయితే దీన్ని నివారించడానికి ఆత్మహత్యలు చేసుకునే తలంపు ఉన్నవారితో వారి అనుభవాలను పంచు కోవడం ద్వారా సన్నిహితంగా మెలిగి వారి బాధలు నివారణకు చిన్న సలహా ఇచ్చి వారిని ఆ ప్రయత్నాలు వీడి నమ్మకం , ఆశాభావంతో జీవిస్తారు .
ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు ఉన్నవారిని గుర్తించి వారిలో ఒక రకమైన నమ్మకాన్ని , ఆశాభావాన్ని కలిగించాలి .అది ఎంత చిన్న సహాయమైనా సరే వారిలో ఒక పెద్ద మార్పు కలిగించవచ్చు .మొదట బాధపడే వారిని సమస్య ఏమిటి అడిగి తెలుసుకోవాలి.మీరు ఆ సమస్యకు పరిష్కార చూపనవసరం లేదు .మీరు కొంత సమయం కేటాయించి, వారి బాధకరమైన అనుభవాలు ఆత్మహత్యా ప్రయత్నాలను వింటే చాలు వారికి సహాయం చేసినవారమౌతాం .ఒక చిన్న సలహా వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని అయితే దీన్ని నివారించడానికి ఆత్మహత్యలు చేసుకునే తలంపు ఉన్నవారితో వారి అనుభవాలను పంచు కోవడం ద్వారా సన్నిహితంగా మెలిగి వారి బాధల నివారణకు చిన్న సలహా ఇచ్చి వారిని ఆ ప్రయత్నాలు వీడి నమ్మకం, ఆశాభావంతో జీవిస్తారు.తొలుతీ ఈ ర్యాలీని ఖమ్మం నగర మేయర్ పునగొల్లు నీరజ జెండా వూపి ర్యాలీని ప్రారంభించారు .ఈ ర్యాలీలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా॥బి వెంకటేశ్వర్లు , డిప్యూటీ డిఎం& హెచ్.డా॥ రాంబాబు , ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డా॥భాగం కిషన్ రావు , ఐఎంఏ కార్యదర్శి కంభంపాటి నారాయణరావు , డా ॥ప్రమోద్ రెడ్డి , డా॥ టీ.సురేష్ , ఖమ్మం నగర వైద్యులు డా॥ వై.నాగమణి, డా॥ ఆదిశంకరరావు , డా॥ అజయ్ కుమార్ , డా॥ సంధ్యారాణి , డా॥ కిశోర్ , డా॥హరిప్రసాద్ , డా॥ కొల్లి అనుదీప్ తో పాటు అనేక మంది వైద్యులు పాల్గొన్నారు .ఈ ర్యాలీలో కిన్నెర , పులిపాటి , మమత ఆసుపత్రి నర్సింగ్ స్టాఫ్ మరియు విద్యార్థినీ , విద్యార్థులు హజరై ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆత్మహత్యనైనా అపుతాం” అని ప్రతిజ్ఞ చేశారు .