టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘బాహుబలి’.ప్రభాస్ హీరోగా అనుష్క, తమన్నాలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ వంటి పలువురు ప్రముఖులు నటించారు.
ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా ఆడియోను మే 31న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.
ఈ సినిమా ఆడియో వేడుక కోసమే ఏకంగా కోటి రూపాయల బడ్జెట్ను నిర్మాతలు కేటాయించినట్లుగా సినీ వర్గాల వారి ద్వారా తెలుస్తోంది.ఇక ఈ ఆడియో వేడుకకు యాంకర్గా యువ హీరో నాని వ్యవహరించనున్నాడు.
ఇంత ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న ఈవెంట్కు ముఖ్య అతిథులు ఎవరా అని అందరిలోనూ ఒకటే ఉత్కంఠ నెలకొంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్ మరియు కరణ్ జోహార్లు హాజరు కానున్నారు.
కోలీవుడ్ నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు పలువును నిర్మాతలు దర్శకులు వేడుకలో సందడి చేయనున్నారు.ఇక టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్, దాసరి నారాయణ రావులు పాల్గొనే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
మే 31న భారీ సంఖ్యలో అభిమానుల సమక్షంలో హైదరాబాద్ హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్లో జరుగబోతుంది.ఇక ఈ సినిమా జులై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.